కాజులూరు మండలంలో రాష్ట్ర సీ.ఎం. వై.ఎస్. జగన్ మోమన్ రెడ్డి పుట్టిన రోజు వేడుకలను గనిరెడ్డి స్వగృహం దగ్గర ఘనంగా నిర్వహించారు. మొగలిపాలెం గ్రామం లోని వైకాపా నాయకులు తాడి, గనిరెడ్డి ఆధ్వర్యంలో ఈ పుట్టినరోజు వేడుకల ప్రారంభించారు. ఈ వేడుకలకు వై.సీ.పీ. కార్యకర్తలు, 200మంది పార్టీ నాయకులు హాజరై సందడి చేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ… వచ్చే ఎన్నికల్లో మల్లి జగన్ ని ముఖ్య మంత్రి ని చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో వైకాపా మండల అధ్యక్షులు గుబ్బల ఏసురాజు, తాడి గనిరెడ్డి, దండంగి చిన్నారావు, యాళ్ళ సత్తిబాబు, గండి కిషోర్, తదితరులు పాల్గొన్నారు.
మొగలిపాలెంలో జగన్ జన్మదిన వేడుకలు…
