మెజారిటీ నోటా ఓట్లు పోలైన స్థానాల్లో మళ్లీ రీపోలింగ్ ను కోరుతూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యం పి.ఐ.ఎల్.పై సుప్రీంకోర్టు శుక్రవారం భారత ఎన్నికల కమిషన్ ఇ.సి.ఐ. కు నోటీసు జారీ చేసింది. ఇది ఎన్నికల ప్రక్రియకు సంబంధించినదని ఎన్నికల సంఘం ఏం చెబుతుందో చూద్దాం అని భారత ప్రధాన న్యాయమూర్తి సీ.జే.ఐ. ధనంజయ వై. చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది.
న్యాయమూర్తులు జె.బి. పార్దివాలా, మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం ఈ వ్యాజ్యాన్ని చేపట్టడానికి ఎటువంటి తేదీని పేర్కొనకుండా ఈ.సీ. ప్రతిస్పందనను కోరింది. ఖేరా తరఫు సీనియర్ న్యాయవాది గోపాల్ శంకరనారాయణ మాట్లాడుతూ… ఈ అంశం ఒక ముఖ్యమైన అంశాన్ని లేవనెత్తుతుందని, సూరత్ పార్లమెంటు స్థానం యొక్క ఇటీవలి ఉదాహరణను పరిగణనలోకి తీసుకోవాలని చెప్పారు.
ఇక్కడ బీ.జే.పీ. అభ్యర్థి మాత్రమే పోటీలో ఏకపక్షంగా ఎన్నికైనారని చెప్పారు. సూరత్లో వేరే అభ్యర్థి లేకపోవడంతో ఓట్లన్నీ ఒక్క అభ్యర్థికే పడేవని శంకరనారాయణ అన్నారు. నోటాను కల్పిత ఎన్నికల అభ్యర్థిగా ప్రకటించాలని, నోటాకు గరిష్టంగా ఓట్లు పోలైన పక్షంలో ఎన్నికలను రద్దు చేసి, సంబంధిత నియోజకవర్గానికి మళ్లీ ఎన్నికలు నిర్వహించేలా మార్గదర్శకాలను రూపొందించాలని పిటిషన్ కోర్టు నుండి ఈ.సీ. ని కోరింది.

