కాకినాడ నగరంలోని వీధుల్లో సి.సి. రోడ్లను ఎత్తు చేయడంతో ప్రధాన రహదారుల జంక్షన్లు అతి పల్లంగా తయారయ్యాయని, ఇప్పుడు వీటిని ఎత్తు చేస్తే ఇండ్లల్లోకి మురుగు నీరు ,వర్షం నీరు చేరే ప్రమాదం వుందని పౌరసంక్షేమసంఘం తెలిపింది. ఆర్ అండ్ బి క్రాస్ కల్వర్టుల దిగువ పూడికలు వేసవి ముందు తీయ్యకపోవడం, తగిన వెడల్పుతో పూర్వ కల్వర్టుల పునః నిర్మాణం చేయక పోవడం వల్ల రేచర్ల పేట రైల్వేడ్రైన్ పి డబ్ల్యూడి కాలువలు, చీడీలపోర మేజర్ డ్రెయిన్స్, కవర్ స్లాబ్ డ్రైన్స్, ఉప్పుటేరు ప్రక్షాళన చేయకపోవడం వల్ల వర్షం ధాటికి వరద ముంపుగా మారి మురుగు నీటితో ముంచెత్తుతుందని అన్నారు. మురుగు నీరు పారే అవుట్ లెట్స్ నిర్మించాల్సిన అత్యవసరమని పౌరసంక్షేమసంఘం ప్రభుత్వాన్ని కోరింది.
మురుగుముంప్పు నుంచి స్మార్ట్ సిటీ ని రక్షంచాలి…

