జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎస్.పీ. వారి ఆదేశాల మేరకు పోలీసు శాఖ వారి ఆధ్వర్యంలో మాదక ద్రవ్యాల వినియోగాలపై అవగాహనా సదస్సును నిర్వహించారు. ఆర్.టీ.సీ., అమలాపురం డిపో నందు మాదక ద్రవ్యాల రవాణా నిరోధించటానికి, మాదక ద్రవ్యాల వాడకం వలన దుష్పరిణామలు తెలియచేయడానికి ఆర్.టీ.సీ. సిబ్బంది, జిల్లాలో వివిధ డిపోల నుండి హాజరైన లాగిస్టిక్స్ కౌంటర్ ఆపరేటర్లు అవగాహన కోరకు మీటింగ్ తో పాటు కార్గో కౌంటర్ నందు డెమోనిస్ట్రేషన్ నిర్వహించారు. ముఖ్య అతిధిగా విచ్చేసిన శ్రీ. ఎస్. కాదర్ బాషా గారు , Addl SP, మాట్లాడుతూ… విద్యార్ధి దశలో యువత మాదక ద్రవ్యాల పట్ల ఆకర్షితులు అవ్వకుండా ఉండాలని వాటి వలన వచ్చే దుష్పరిణామాలను వివరించారు. M. అంబికా ప్రసాద్, DSP/AMP మాట్లాడుతూ… గంజాయి అక్రమ రవాణా జరగకుండా నిరోధించడానికి సిబ్బందికి పలు సూచనలు తెలియజేసారు.
మాదక ద్రవ్యాల వినియోగాలపై అవగాహనా సదస్సు…

