Political

మరో 11 మంది అభ్యర్థులను ప్రకటించిన బహుజన్ సమాజ్ పార్టీ…

R (3)

రాబోయే 2024 లోక్‌సభ ఎన్నికలకు బహుజన్ సమాజ్ పార్టీ బి.ఎస్‌.పి. మంగళవారం అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. ప్రధాని నరేంద్ర మోడీ ఎన్నికల్లో పోటీ చేయనున్న వారణాసి లోక్‌సభ స్థానంతో సహా 11 పార్లమెంటు నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించింది. వారణాసి పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి ఎన్నికల్లో పోటీ చేసేందుకు బీఎస్పీ ప్రధాని మోదీపై అథర్ జమాల్ లారీని రంగంలోకి దించింది. లారీతో పాటు బరేలీ నుంచి ఛోటేలాల్ గంగ్వార్, ఘాజీపూర్ నుంచి ఉమేష్ కుమార్ సింగ్‌ను బరిలోకి దింపిన పార్టీ మైపురి స్థానానికి అభ్యర్థిని మార్చి శివప్రసాద్ యాదవ్‌కు టికెట్ ఇచ్చింది.

ఉత్తరప్రదేశ్‌లో వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో పొత్తులు పెట్టుకోకూడదని బీఎస్పీ నిర్ణయించింది. బదులుగా రాష్ట్రంలో స్వతంత్రంగా పోటీ చేసేందుకు సిద్ధమైంది. ఈ నిర్ణయం ఐ.ఎన్.డీ.ఐ. కూటమికి సవాలుగా నిలిచింది, అనేక స్థానాల్లో ఓట్లను విభజించే అవకాశం ఉందని రాజకీయ వర్గాల సమాచరం. ఉత్తరప్రదేశ్‌లో 2024 లోక్‌సభ ఎన్నికలు ఏప్రిల్ 19 నుండి జూన్ 1 వరకు ఏడు దశల్లో జరుగుతాయి.

Avatar

Simhadri Penke

About Author

You may also like

electrical
Political

నూతన ఎలక్ట్రికల్ బస్సు లు కొనుగోలుకు సిద్ధం..

ఈ ఏడాది విజయ దశమి సంధర్బంగా వెయ్యి ఎలక్ట్రికల్ బస్సు లు కొనుగోలుకు సిద్ధం చేస్తున్నామని ఆర్టీసీ ఎండి ద్వారకా తిరుమలరావు తెలిపారు. ఆర్టీసీ ఎండి ద్వారకా
R
Political

దత్తపుత్రుడి శాశ్వత చిరునామా తెలంగాణ..

దత్తపుత్రుడి శాశ్వత చిరునామా హైదరాబాద్ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మెహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పై తీవ్ర విమర్షలు చేసారు.