ఆంద్ర ప్రదేశ్ రాష్ట్రంలో విశాఖపట్నం సిరిపురం గ్రామంలో గల వై.సీ.పీ. మంత్రి బొత్స సత్యన్నారాయణ స్వగృహం నందు నిరుద్యోగ జే.ఏ.సీ. రాష్ట్ర అధ్యక్షుడు సమయం హేమంత కుమార్ కలిసారు. రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యలపై ఆయనకు వినతి పత్రాన్ని అందించారు. ఈ సందర్బంగా బొత్సా మాట్లాడుతూ… త్వరలోనే డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తున్నట్టుగా తెలిపారు. మిగతా జాబ్ క్యాలెండర్ వయోపరిమితి పెంపు గురించి కూడా మంత్రి గారితో చర్చించి వినతి పత్రం అందచేసారు. కానిస్టేబుల్ రాత పరీక్షలు జరిగి సుమారు సంవత్సరం కావస్తుందని వీరికి లోపం ఉన్న ప్రతి ప్రశ్నకి ఒక గ్రేస్ మార్క్ వేసి న్యాయం చేయాలని హేమంత్ కోరారు.
మంత్రి బొత్స తో నిరుద్యోగ జే.ఏ.సీ. భేటీ… ఎందుకంటే…???

