ప్రతి ఒక్కరికీ మంచే జరుగుతుంది తప్పా చెడు మాత్రం జరగదని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. అందరికీ మంచి చేసేలా ప్రతి జిల్లా కలెక్టర్ బాధ్యతలు తీసుకుంటారని, ఒకవేళ మీకు మంచి జరగలేదు అనుకుంటే జగనన్నకు చెబుదాం 1902 నంబర్కు కాల్ చేసి చెప్పవచ్చని ఆయన సూచించారు. నేరుగా నా కార్యాలయ సిబ్బంది ఆ ఫోన్ లిఫ్ట్చేసి మీ సమస్యను పరిష్కరిస్తారని ముఖ్యమంత్రి వెల్లడించారు. తిరుపతి జిల్లాలో 92 రిలీఫ్ క్యాంపులు పెట్టామని, ఎనిమిది వేల మందికి పునరావాసంతో పాటు 60 వేల మందికి రేషన్ బియ్యం, సరకులు అందించామన్నారు.
మంచే జరుగుతుంది తప్పా… చెడు మాత్రం జరగదు

