జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ భీమవరం పర్యటన విషయంలో ఆర్ అండ్ బి శాఖ మోకాలడ్డింది. ఈ కారణంతో చేపట్టాల్సిన పవన్ కళ్యాణ్ భీమవరం పర్యటనను వాయిదా వేయడమైంది. పర్యటన ఎప్పుడు నిర్వహించేది త్వరలో తెలియచేస్తామని పార్టీ ఉపాధ్యక్షులు బి.మహేందర్ రెడ్డి తెలిపారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతు… విష్ణు కాలేజీ ప్రాంగణంలోని హెలీకాప్టర్ ల్యాండ్ చేసేందుకు అనుమతులు కోరితే అధికారులు అభ్యంతరాలు చెబుతూ నిరాకరించారన్నారు.
దూరంగా ఉన్న భవనాన్ని సాకుగా చూపిస్తూ అభ్యంతరపెట్టడం వెనక అధికార పక్షం ఒత్తిళ్ళు ఉన్నట్లు అర్థమవుతోంది. విష్ణు కాలేజీలో ఉన్న హెలీప్యాడ్ ను భీమవరం పర్యటనకు వచ్చిన పలువురు ప్రముఖుల కోసం వినియోగించారని అన్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ పర్యటన విషయంలోనే అభ్యంతరాలు చూపడం విచిత్రంగా ఉందన్నారు. అధికార యంత్రాంగాన్ని రాజకీయ కక్ష సాధింపు కోసం వాడుకోవడాన్ని ఖండిస్తున్నామని అన్నారు.

