వాసుదేవ గురుస్వామి (ఉంగరాల వీర వెంకట సుబ్బారావు) ఆధ్వర్యం లో భద్రాచల శ్రీరామ రథోత్సవ పాదయాత్ర సమితి బృందం 400 మంది హనుమ దీక్షా పరులతో ప్రయాణమయ్యింది. ఆదివారం ఉదయం కాకినాడ స్వయంభూ భోగిగణపతి పీఠంలో బ్రహ్మముహూర్తం నందు తొలిపూజలు నిర్వహించి అచ్చంపేట నుండి గొంచాల మీదుగా కాలినడకతో శ్రీరామ రథం లాగుతూ సామర్లకోట జాతీయ రహదారి పై భద్రాచలం తరలి వెళ్లారు.
వాసుదేవ గురుస్వామి మాట్లాడుతూ… 13వ వార్షిక యాత్ర 10రోజుల్లో పూర్తి చేసి భారీ అన్న సమారాధన చేస్తామన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం సౌజన్యంతో గొంచాల పంచాయితీ కల్పించిన స్థలంలో రు. 25 లక్షలతో నిర్మిస్తున్న పాదయాత్ర రామాలయం ఏడాదిలో పూర్తి చేయడ జరుగుతున్నదన్నారు. యాత్ర లో రోజుకు రు.70 వేల ఖర్చుతో ఉదయం సాయంత్రం అల్పాహార భోజన వసతి ఏర్పాట్ల ను దాతలు అందిస్తున్నారన్నారు.

