బేవరేజ్ హమాలీల రాష్ట్ర యూనియన్ పిలుపు మేరకు సామర్లకోట బేవరేజ్ డిపో వద్ద హమాలీలు శుక్రవారం అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా హమాలిస్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి వి. కొండలరావు మాట్లాడుతూ… గత సంవత్సరం 2023 అక్టోబర్ నెలతో ఎగుమతి రేట్లు కు సంబంధించి అగ్రిమెంట్ ముగిసిందన్నారు. నవంబర్ నుండి రేట్లు పెంచి నూతన ఒప్పందం అమలు చేయవలసి వుందన్నారు.
ఎం.డి. ని నాలుగు సార్లు కలసి వినతి పత్రం అందజేయడం జరిగిందని, ఎన్ని సార్లు కలసి మాట్లాడినా… కాంట్రక్టర్ ను పిలిపించి చర్చలు జరిపుతాము అనిచెప్పి మూడు నెలలు నుండి కాలయాపన చేస్తూ వస్తున్నారన్నారు. ఒక ప్రక్క నిత్యావసర వస్తు ధరలు ఆకాశాన్ని అంటాయని, ఇంటి పన్ను, చెత్త పన్ను, కరెంటు చార్జీలు, పెట్రోల్, డీజిల్ ధరలు విపరీతంగా పెరిగిపోయన్నారు.
ఈ పరిస్థితిలో రోజూ వచ్చే కూలితో హమాలీ కుటుంబాలు గడవక ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. తక్షణమే కార్పొరేషన్ యాజమాన్యాలు కాంట్రాక్టర్లతో చర్చలు జరిపి వేతన ఒప్పందం అమలు చేయాలని, లేని పక్షంలో సమ్మె లోకి వెళ్ళవలసి ఉంటుందని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో యూనియన్ అధ్యక్ష కార్యదర్శిలు బి. ఆదినారాయణ, వి. అప్పలారాజు హమాలీలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

