బెంగాల్లోని నదియా జిల్లాలోని రానాఘాట్లో శుక్రవారం రాత్రి బీజేపీ బూత్ అధ్యక్షుడి ఇంటి ముందు బాంబు పేలింది. పేలుడుకు తృణమూల్ కార్యకర్తలే కారణమని కాషాయ పార్టీ ఆరోపించింది. ఈ పేలుడుకు టీ.ఎం.సీ. కౌన్సిలర్ జోయ్దీప్ దత్తా సూత్రధారి అని బాధితుడు కళ్యాణ్ ఘోష్ ఆరోపించారు. పేలుడు శబ్దం విని ప్రజలు బయటకు వచ్చేసరికి ముగ్గురు టీ.ఎం.సీ. వ్యక్తులు పారిపోయారని వారు అన్నారు. బీ.జే.పీ. శనివారం ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేసింది. అయితే టి.ఎం.సి. ఆరోపణలను తిరస్కరించింది. నిందితులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ బీ.జే.పీ. మద్దతుదారులు రాణాఘాట్ పోలీస్ స్టేషన్ను ముట్టడించారు.
బెంగాల్లోని బీజేపీ బూత్ చీఫ్ ఇంటి దగ్గర పేలుడు…

