Political

బీ.జే.పీ. తో పొత్తు ఖరార్…

OIF (1)

భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శక్తిమంతమైన, దార్శనిక నాయకత్వంలో రానున్న లోక్ సభ, శాసన సభ ఎన్నికల్లో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం, జనసేన పార్టీలు కలసి పని చేయాలని నిర్ణయించుకున్నట్లు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాన్ తెలిపారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి, ప్రగతి, ప్రజల స్థితిగతుల మెరుగుదలకు మూడు పార్టీలూ కట్టుబడి ఉన్నాయని అన్నారు. తద్వారా మన దేశ పురోగతి సాధిస్తూ అంతర్జాతీయంగా భారతదేశ నాయకత్వం పరిఢవిల్లాలని ప్రగాఢ ఆకాంక్ష అన్నారు. ఢిల్లీలో మూడు పార్టీల మధ్య సాగిన సమావేశాలతో పొత్తు ఖరారైంది.

ఈ క్రమంలోనే సోమవారం అమరావతిలో మూడు పార్టీలు సుదీర్ఘంగా సమావేశం నిర్వహించాయి. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు, వారి ఆకాంక్షలకు అనుగుణంగా ఈ కూటమిలోని భాగస్వాములు ఉంటారు. సీట్లు పంపకం విషయంలోనూ రాష్ట్ర భవిష్యత్తుకే ప్రథమ ప్రాధాన్యం ఇచ్చి ఒక అంగీకారానికి వచ్చారు. ఈ చర్చలతో రాష్ట్ర పురోభివృద్ధికి ఒక బలమైన పునాది పడింది. పార్లమెంట్ ఎన్నకలలో బీ.జే.పీ. కి 6, టీ.డీ.పీ. 17, జే.ఎస్.పీ. 2 స్థానానలు కేటాయించినట్లు వెళ్లడించారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీ.జే.పీ. కి 10, టీ.డీ.పీ. కి 144, జే.ఎస్.పీ. కి 21 స్థానానలు కేటాయించినట్లు తెలిపారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

electrical
Political

నూతన ఎలక్ట్రికల్ బస్సు లు కొనుగోలుకు సిద్ధం..

ఈ ఏడాది విజయ దశమి సంధర్బంగా వెయ్యి ఎలక్ట్రికల్ బస్సు లు కొనుగోలుకు సిద్ధం చేస్తున్నామని ఆర్టీసీ ఎండి ద్వారకా తిరుమలరావు తెలిపారు. ఆర్టీసీ ఎండి ద్వారకా
R
Political

దత్తపుత్రుడి శాశ్వత చిరునామా తెలంగాణ..

దత్తపుత్రుడి శాశ్వత చిరునామా హైదరాబాద్ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మెహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పై తీవ్ర విమర్షలు చేసారు.