Viral

బాయిలర్ పేలుల్లో 8 మంది మృతి…

61e9dd4db5f11-1

మహారాష్ట్రలోని థానే జిల్లాలో గృహ సముదాయాలు, మురికివాడలతో చుట్టుముట్టబడిన డోంబివిలి ఎం.ఐ.డి.సి. ఫేజ్-2 లోని కెమికల్ యూనిట్‌లో గురువారం బాయిలర్ పేలడంతో పెద్ద అగ్నిప్రమాదం సంభవించన విషయం తేలిసిందే. అయితే ఈ ప్రమాదంలో ఎనిమిది మంది మరణించగా, 62 మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రెస్‌కి వెళ్లే సమయానికి శీతలీకరణ కార్యకలాపాలు ఇంకా కొనసాగుతున్నందున కొంతమంది వ్యక్తులు అముదన్ కెమికల్స్ ప్రైవేట్ లిమిటెడ్ లోపల చిక్కుకుపోయారని తెలిపారు.

మధ్యాహ్నం 1.15 గంటలకు సంభవించిన ఈ పేలుడు 5 కిలోమీటర్ల దూరం వరకూ వినిపించిందని, పేలిన బాయిలర్ భాగాలు 1.5 కిలోమీటర్ల దూరంలో పడిపోయాయని అధికారులు తెలిపారు. కర్మాగారాలు, దుకాణాలు, నివాసాల కిటికీలు ధ్వంసమయ్యాయి, కొంతమంది గాయపడ్డారని వెళ్లడించారు. సప్తవర్ణ కెమికల్స్, మెహతా పెయింట్ మరియు కెజిఎన్ కెమికల్స్ అనే మూడు పక్కనే ఉన్న ఫ్యాక్టరీలకు మరియు కార్ షోరూమ్‌కు మంటలు వ్యాపించడంతో అక్కడున్న 12 వాహనాలు దగ్ధమయ్యాయి.

Avatar

Simhadri Penke

About Author

You may also like

IMG-20231028-WA0016
Viral

సోషల్ మీడియా దుర్వినియోగమవుతుందా…!

  సోషల్ మీడియా దుర్వినియోగమవుతుందా… అంటే చాలా మంది పోలీసులు అవుననే తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. పోలీస్‌ సంస్మరణ వారోత్యవాలలో భాగంగా కాకినాడ జిల్లా పోలీసు
News Entertainment & Arts Viral Trending News Political

తెలుగుదేశం పార్టీ టికెట్‌పై పోటీకి సిద్దం

వచ్చే ఎన్నికల్లో అనంతపురం జిల్లా గుంతకల్లు నియోజకవర్గం నుంచి అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేయడానికి సుముఖంగా ఉన్నట్లు సినిమా హీరో రాజ్ కుమార్ సంచలన ప్రకటన చేశారు.