Political

ఫిబ్రవరి 16 న దేశవ్యాప్త గ్రామీణ బంద్…

WhatsApp Image 2024-02-13 at 4.58.50 PM

బీ.జే.పీ. ప్రభుత్వం రైతు, వ్యవసాయ, కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా ఫిబ్రవరి 16వ తేదీన దేశవ్యాప్తంగా సంయుక్త కిసాన్ మోర్చా-కార్మిక ప్రజా సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలోగ్రామీణ బంద్, పారిశ్రామిక సమ్మెకు పిలుపునివ్వడం జరిగింది. ఈ పిలుపులో భాగంగా కాకినాడ జిల్లాలో భారత కమ్యూనిస్టు పార్టీ సి.పి.ఐ., రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం, ఆల్ ఇండియా ట్రేడ్ కాంగ్రెస్ ఏ.ఐ.టీ.యూ.సీ. ఆధ్వర్యంలో కాకినాడ జిల్లాలో విస్తృతంగా కరపత్రాలు పంపిణీ చేస్తూ ప్రచారం చేసారు.
ఈ సందర్భంగా తాటిపాక మధు మాట్లాడుతూ… కేంద్ర బీ.జే.పీ. ప్రభుత్వం రైతు వ్యతిరేక నల్ల చట్టాన్ని తీసుకొచ్చిందని, ఆ చట్టాలను పార్లమెంట్లో ఆమోదించాలని ప్రయత్నం చేయగా సుమారు 500 పైన రైతు సంఘాలు కలిసి ఢిల్లీ నడిరోడ్డుపై సంవత్సరం పాటు సుదీర్ఘమైన పోరాటం చేశారన్నారు. ఆ పోరాటానికి మోడీ వెనక్కి తగ్గి ఆ జీవోలను పార్లమెంట్లో ప్రవేశపెట్టి రద్దు చేస్తానని చెబుతూనే ఆ తీర్మానాలు ప్రవేశపెడుతున్నారని పేర్కొన్నారు. ఈ ప్రచారంలో వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు తాటిపాక మధు, సి.పి.ఐ. జిల్లా కార్యదర్శి కామిరెడ్డి బోడకొండ, తదితరులు పాల్గొన్నారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

electrical
Political

నూతన ఎలక్ట్రికల్ బస్సు లు కొనుగోలుకు సిద్ధం..

ఈ ఏడాది విజయ దశమి సంధర్బంగా వెయ్యి ఎలక్ట్రికల్ బస్సు లు కొనుగోలుకు సిద్ధం చేస్తున్నామని ఆర్టీసీ ఎండి ద్వారకా తిరుమలరావు తెలిపారు. ఆర్టీసీ ఎండి ద్వారకా
R
Political

దత్తపుత్రుడి శాశ్వత చిరునామా తెలంగాణ..

దత్తపుత్రుడి శాశ్వత చిరునామా హైదరాబాద్ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మెహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పై తీవ్ర విమర్షలు చేసారు.