రాష్ట్రంలోప్రభుత్వ ప్రజాప్రతినిధులు అధికారులు మారినా స్థానిక ప్రభుత్వం కాకినాడ నగర పాలక సంస్థలో మాత్రం అధికారులు సిబ్బంది ఎవ్వరూ మారలేదని వారి తీరులోనూ మార్పు లేదని పౌరసంక్షేమ సంఘం పేర్కొంది. ఫలితంగా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా పాల క వర్గం కౌన్సిల్ లేకపో వడంతో పరిస్థితులు మరింత అధ్వాన్నంగాతయార వుతున్నారు.
రెవిన్యూ టౌన్ ప్లానింగ్ హెల్త్ పరిపాలన విభాగాల్లో ఏళ్ల తరబడి కొలువు దీరిన అధికారులు గత అయిదేళ్ల నుండి కార్పో రేషన్ ఆస్తులను నాశనం చేయడం అవినీతి ఆస్తులు కూడబెట్టడం అక్రమ నిర్మాణాలను ఇష్టారాజ్యం చేయడం వంటివి సాగించినా ఎటువంటి చర్యలు లేవన్నారు.
స్మార్ట్ సిటీ కంపెనీ ఏర్పడిన తరువాత గత 2016 నుండి ఎ.సీ.బీజ విజిలెన్స్ దర్యా ప్తులు జరగలేదన్నారు. తెదేపా, జనసేన, బీ.జే.పీ. కూటమి అధినేత లు వీటిపై దృష్టి సారించే విధంగా కూటమి శ్రేణులు నగర ప్రగతి కోసం పబ్లిక్ డిమాండ్ తెలియజేయాలన్నారు. స్పెషల్ ఆఫీసర్ అధ్యక్ష తన సిటీ రూరల్ ఎమ్మె ల్యేలు స్థానిక ఎంపీ ఉమ్మడిగా ప్రత్యేక సమీక్ష నిర్వహించాల న్నారు. అఖిలపక్షం సూచనలు సలహాలు స్వీకరించాలని కోరారు.

