ఆంధ్ర రాష్ట్రంలో ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని దొడ్డిదారిన ఎట్టి పరిస్థితుల్లోనైనా అమలు చేసేందుకు జగన్మోహన్ రెడ్డి కంకణం కట్టుకున్నారని జనసేన, టీ.డీ.పీ., బీ.జే.పీ. కూటమి పార్టీల నేతలు సంయుక్తంగా విమర్శించారు. మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం జరిగిన విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి తమ్మిరెడ్డి శివశంకర్, టీ.డీ.పీ. రాష్ట్ర అధికార ప్రతినిధి ఎన్. విజయకుమార్, బీ.జీ.పీ. రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి లంక దినకర్ పాల్గొన్నారు. భూ కబ్జాలకు ఊతమిచ్చేలా ప్రభుత్వం ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని ప్రవేశపెట్టిందని వారు మండిపడ్దారు. నీతిఆయోగ్ సూచనలు పరిగణనలోకి తీసుకోకుండా చట్టంలో సవరణలు చేశారన్నారు.
ప్రజల హక్కులు కాలరాసే విధంగా వైసీపీ ప్రయత్నాలు…

