జ్యోతుల నెహ్రూ టి.డి.పి. అభ్యర్థిగా కాకినాడ జిల్లాలోని జగ్గంపేట నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు సర్వం సిద్ధం చేసారు. ఇందుకు గాను ఎన్నికల ప్రచారానికి ఎస్.ఈ.డీ. స్క్రీన్ తో కూడిన ప్రచార రథాన్ని సన్నద్దం చేసారు. రథసప్తమి సందర్బంగా ఆయన ఇర్రిపాక వద్ద ఉన్న శివాలయంలో రథానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఘనంగా ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… రాక్షస పాలనను అంతం చేసి ప్రజలకు విమూక్తి కలిగించేందుకు ఈ ప్రచార రథాన్ని సిద్దం చేసామని అన్నారు. ఈ కార్యక్రమానికి టి.డి.పి. సమన్వయ కమిటీ సభ్యులు, కార్యకర్తలు, జ్యోతుల నవీన్ కుమార్, తదితరులు పెద్ద ఎత్తున కదలివచ్చారు.
ప్రచార రథానికి ప్రత్యేక పూజలు…

