కాకినాడ జిల్లా పిఠాపురంలో దళిత సోదరులు ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో జై భీమ్.. జై పవన్ కళ్యాణ్.. అనే నినాదాలతో సమావేశం మారు మ్రోగింది. పిఠాపురం నియోజకవర్గంలో నిర్వహించిన సమావేశంలో వందలాది మంది దళిత యువత, మహిళలు, వృద్ధులు హాజరయ్యారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… వై.ఎస్.ఆర్.సీ.పీ. ప్రభుత్వం దళితులకు చేస్తున్న అన్యాయాలపై విరుచుకు పడ్డారు.
దళితులకు రాజ్యాధికారం జనసేన పార్టీతోనే సాధ్యమవుతుందని అన్నారు. ఎన్నో రాజకీయ పార్టీలను అనాదిగా గెలిపిస్తూ వస్తున్నా ఎవరూ కూడా దళిత సమాజానికి మేలు చేయలేదని, బీఎస్పీ అధినేత్రి అయిన మాయావతిని హైద్రాబాద్ కు ఆహ్వానించి సన్మానం చేసిన నాయకుడు పవన్ కళ్యాణ్ మాత్రామేనని, ఆయన పిఠాపురంలో పోటీ చేస్తున్నారనే ప్రకటన వచ్చినప్పటినుంచి పిఠాపురంలో ఉన్న దళితులలో ఆశలు చిగురించాయని యువతి, యువకులు హర్షం వ్యక్తం చేసారు.

