బుధవారం పాయకరావుపేటలో జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు పర్యటించి స్థానిక ప్రజలతో మమేకమయ్యారు. ఈ సందర్భంగా స్థానికులు పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకొచ్చారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… కరోనా వైరస్ కంటే వై.సీ.పీ. ప్రమాదకరం అనే స్థితికి రాష్ట్ర ప్రజలు వచ్చారని అన్నారు.
జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నాలుగున్నసంవత్సరాలయినా గ్రామాల్లో కనీస మౌలిక వసతులైన రోడ్లు, సాగు, తాగునీరు, డ్రైనేజ్ సదుపాయం కల్పించదన్నారు. కరోనా వైరస్ కంటే వై.సీ.పీ. ప్రమాదకరం అనే స్థితికి రాష్ట్ర ప్రజలు వచ్చారని జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు గారు యదేవ చేసారు.
నిరంకుశత్వంతో రెచ్చిపోతున్న వైసీపీ వైరస్ కు జనసేన- తెలుగుదేశం విజయమే వ్యాక్సినేషన్ అన్నారు. మన బిడ్డల భవిష్యత్తు బాగుండాలంటే పొత్తులో భాగంగా ఎవరికి ఏ స్థానం దక్కినా కలసికట్టుగా పని చేయాలని పిలుపునిచ్చారు.

