పల్లె వెలుగు బస్సుల్లో అల్ట్రా బస్ వేరయా అన్నట్టుగా రూ.10 ల అదనపు ధర వసూలు చేయడం దోపిడీ చందంగా వుందని పౌర సంక్షేమ సంఘం పేర్కొంది. కాకినాడ జగన్నాధపురం నుండి ద్రాక్షారామానికి వెళ్ళే పల్లె వెలుగు బస్ రూ.30 ల టికెట్ ధర వసూలు చేస్తుండగా అల్ట్రా పల్లె వెలుగు బస్ లో రు. 40 వసూలు చేయడం తగదన్నారు. కొత్త బస్సు అయినంత మాత్రాన అదనంగా పది రూపాయలు రుబాబు గా వసూలు చేస్తున్న విధానం సవరించాల్సిన అవసరం వుందని వారు డిమాండ్ చేశారు. సామాన్యుల కోసం ప్రవేశపెట్టిన పల్లెవెలుగు లో జరుగుతున్న అడ్డగోలు దోపిడీని అరికట్టాలని పౌర సంఘం కన్వీనర్ సామాజిక వేత్త దూసర్లపూడి రమణ రాజు డిమాండ్ చేశారు.
పల్లెవెలుగు బస్ రేట్లను తగ్గించాలి… -పౌరసంక్షేమ సంఘం-

