కాకినాడ జిల్లాలో సామర్లకోట మండలం వెంకటకృష్ణ రాయపురంలో దళితులకు ప్రభుత్వం ఇచ్చిన ఇళ్ల పట్టాలకు స్థలాలు చూపించకుండా సచివాలయం అధికారులు రిజిస్ట్రేషన్లు మొదలెట్టారని లబ్ధిదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అందుకుగాను పట్టాల రిజిస్ట్రేషన్ లను నిరసిస్తూ లబ్ధిదారులు వీ.కే. రాయపురం వద్ద ఉన్న కాకినాడ ప్రధాన కెనాల్ రోడ్ పై భారీ ఎత్తున రాస్తారోకో నిరసన కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. పూర్తిస్థాయిలో లబ్ధిదారులకు న్యాయం చేకూరేవరకూ రిజిస్ట్రేషన్లను నిలిపివేయాలని ఆందోళన చేసారు. ఈ నిరసన కార్యక్రమానికి కుర్రా రాజు, గొల్లపల్లి సర్వేశ్వరరావు, రజనీలు మద్దత్తు పలికారు.
స్థలాలు చూపించేవరకు రిజిస్ట్రేషన్లు ఆపండి…
