ఆధ్యాత్మిక శక్తిపాతం అందించే అయ్యప్పదీక్ష మానవ కళ్యాణానికి మహత్తర సాధనమని భోగి గణపతి పీఠం వ్యవస్థాపక ఉపాసకులు దూసర్లపూడి రమణ రాజు పేర్కొన్నారు. యువకులు అయ్యప్ప దీక్ష చేపట్టే విధంగా పెద్దలు వారికి ప్రోత్సాహం ఇవ్వాలని ఆయన కోరారు. మకర సంక్రాంతి సందర్భంగా సూర్యారావుపేట దూసర్లపూడి వారి వీధిలోని భోగిగణపతి పీఠం అధిదేవత అయ్యప్పకు సోమవారం రాత్రి పంచామృతాలతో ప్రత్యేకంగా అభిషేకం జరిగింది. అయ్యప్ప సహస్రనామాలను సామూహికంగా పఠించిపడి హారతిని అందించారు. ఇందులో పాల్గొన్న దంపతులకు శేష వస్త్రాలు బహూకరించారు. మాలికాపురత్తమ్మ ఆరాధనగా మహిళలకు చీరలు ప్రదానం చేశారు. అయ్యప్ప శరణుఘోష మారు మ్రోగింది.
పంచామృతాలతో మకరహారతి…

