నేటి నుండి కడప, నంద్యాల పార్లమెంటు నియోజకవర్గాల్లో నారా భువనేశ్వరి నిజం గెలవాలి పర్యటన చేయనున్నట్లు వెళ్లడించారు. కడప, ప్రొద్దుటూరు, డోన్, నంద్యాల, శ్రీశైలం, పాణ్యం, నందికొట్కూరు అసెంబ్లీ నియోజకవర్గాల్లో పర్యటించనున్నట్లు భువనేశ్వరి చెప్పారు. చంద్రబాబు అక్రమ అరెస్టు సమయంలో మనస్తాపానికి గురై మృతిచెందిన కార్యకర్తల కుటుంబాలను ఆమె పరామర్శించనున్నారని తెలిపారు. నేటి నుండి మొదలయ్యే టూర్ లో 12మంది కార్యకర్తల కుటుంబాలను పరామర్శిస్తారని తెలిపారు. నందికొట్కూరులో 1, పాణ్యంలో 2, శ్రీశైలంలో 3, నంద్యాలలో 2, డోన్ లో 2, ప్రొద్దుటూరులో 1, కడపలో 1 కుటుంబాలను పరామర్శించనున్నారు.
నేటి నుండి కడప, నంద్యాలలో నిజం గెలవాలి పర్యటన…

