నెల్లూరు నగరంలో జరిగిన ప్రజాగళం ఎన్నికల సభలో ఆయన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడుతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… 2019 ఎన్నికల్లో చేతులు జోడించి ఓట్లు అడిగిన జగన్ ఇప్పుడు ప్రజలను భయపెట్టి ఓట్లు అడిగే స్థాయికి వచ్చాడని జనసేన పార్టీ అధనేత పవన్ కళ్యాన్ వ్యాఖ్యానించారు. ప్రజలను హెచ్చరించేలా అతడి వైకరి మారిపోయిందని, ఇదే జగన్ అసలు నైజమని ఆయన అన్నారు. జగన్ లాంటి వ్యక్తిని స్ఫూర్తిగా, ఆదర్శంగా తీసుకుంటే అతడిలాగే తయారవుతారని యదేవ చేసారు. నెల్లూరు నాకు విలువయిన జ్ఞానాన్ని అందించిందని గుర్తుచేసుకున్నారు. జగన్ లాంటి దుర్మార్గమైన వ్యక్తితో తలపడటానికి బీజం వేసింది నెల్లూరు అని అన్నారు.
నెల్లూరు ప్రజాగళం సభలో పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు…

