జనసేన పార్టీ ఇంచార్జ్, రాష్ట్ర పి.ఎ.సి. సభ్యులు పంతం నానాజీ అధ్వర్యంలో స్ధానిక గంగరాజు నగర్ లో కాకినాడ గ్రామీణ నియోజకవర్గ జనసేన పార్టీ నూతన కార్యాలయాన్ని జనసేన, దేశం తెలుగు దేశం, భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు కోలాహలం మధ్య ఘనంగా ప్రారంభమయ్యింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… తెలుగు దేశం పార్టీ, భాజాపా, జన సేన పార్టీ కార్యకర్తలు, నాయకుల సమిష్టి సహకారంతో కృషి చేసి విజయం సాధించడం జరుగుతుందని తెలిపారు. తనపై అభిమానంతో నూతన కార్యాలయం ప్రారంభ మహోత్సవ కార్యక్రమానికి హాజరై ఆశీర్వదించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ చిక్కాల రామచంద్రరావు,టీడీపీ నాయకులు వాసిరెడ్డి ఏసుదాసు, పేరాబత్తుల రాజశేఖర్, నులుకుర్తి వెంకటేశ్వర రావు, తదితరులు పాల్గొన్నారు.
నూతన పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవంలో పంతం నానాజీ…

