ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం లో ఎన్నికలు దగ్గరపడుతుండడంతో జనసేన తెలుగుదేశం తొలి జాబీతాన్ని విడుదలచేసింది. అందులో భాగంగా జనసేన తెలుగుదేశం పార్టీల ఉమ్మడి అభ్యర్థిగా లోకం మాధవిని ప్రకటించారు.ఈ సందర్బంగా బోగాపురం జనసేన కార్యాలయలో సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ… ఇది మనం చేసుకున్న అదృష్టమని పవన్ కళ్యాణ్ నోటివెంట మొదటి పేరు నెల్లిమర్ల నియోజకవర్గం రావడం ఇప్పటివరకు మనం చేసిన కష్టం యొక్క ఫలితమే అని తెలియజేశారు.
ప్రతి ఒక్కరూ ఈ జగన్నాసురుడిని, వైకాపా ప్రభుత్వాన్ని దింపే విధంగా అందరూ కృషి చేయాలని తెలియజేశారు. వచ్చే ఎన్నికల్లో చేయవలసిన కార్యాచరణ, తెలుగుదేశం పార్టీ నేతలతో,కార్యకర్తలతో ఎలా ముందుకు సాగాలి అనేదానిపై నాయకులకు జనసైనికులకు దిశా నిర్దేశం చేశారు.ఎన్నికలకు సంసిద్ధం కావాలని ఈ రెండు నెలలు అహర్నిశలు శ్రమించి పార్టీ యొక్క గాజు గ్లాస్ గుర్తుని ప్రజల్లోకి బలంగా తీసుకొని వెళ్లి చెప్పాలని వివరించారు. ఈ సమవేశానికి నెల్లిమర్ల నలుమూలల నుండి వీర మహిళలు, జనసైనికులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.

