నిరుద్యోగులకు తొలి సంతకం మెగా డీఎస్సీ మీద పెట్టినట్లుగానే , అసెంబ్లీ సమావేశాలలో కూడా నిరుద్యోగ సమస్యలపై సమీక్ష నిర్వహించాలని ఏపీ నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు సమయమం హేమంత కుమార్ కోరారు.అలాగే గ్రూప్ 2 రెండు నెలలు వాయిదా వెయ్యాలని, గ్రూప్ వన్ మరియు డిప్యూటీ డి.ఈ.ఓ. ఉద్యోగాలకు ఎంపిక విధానం 1:100గా చేయాలని తెలిపారు. ఏపీపీఎస్సీ, ఏపీ డీఎస్సీ ఉద్యోగ వయోపరిమితి 47కు పెంచి, మేనిఫెస్టోలో ఇచ్చిన 20 లక్షలు ఉద్యోగాలకు వార్షిక క్యాలెండర్ విడుదల చేయాలన్నారు. స్టడీ మెటీరియల్ ఉచితంగా ఇవ్వాలని అన్నారు. గెలిచిన కుటమి పెద్దలందరికీ ఈ సందర్బంగా ధన్యవాదాలు తెలియజేశారు.
నిరుద్యోగ సమస్యలపై సమీక్ష నిర్వహించాలి…

