బీ.జే.పీ మిత్రపక్షమైన జే.డీ. కి చెందిన లోక్సభ ఎం.పీ. ప్రజ్వల్ రేవణ్ణ సెక్స్ టేపుల వివాదంపై ప్రధాని నరేంద్ర మోదీపై ఏ.ఐ.ఎం.ఐ.ఎం. అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. హైదరాబాద్లో జరిగిన ఓ బహిరంగ సభలో ఒవైసీ మాట్లాడుతూ… ప్రజ్వల్ రేవణ్ణ చేస్తున్న అకృత్యాలు ప్రధాని మోదీకి తెలుసునని, ఇప్పటికీ ఆయన కోసం ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. నరేంద్ర మోదీ ఇప్పుడు మహిళా సాధికారత గురించి మాట్లాడుతున్నారని , తాను ముస్లిం మహిళల సోదరుడినని నరేంద్ర మోదీ చెప్పుకుంటున్నారన్నారు. నీలాంటి బ్రదర్ మాకు అవసరం లేదని హైదరాబాద్ ఎం.పీ. అన్నారు. మాజీ ప్రధాని మరియు పార్టీ అధ్యక్షుడు హెచ్డి దేవెగౌడ మనవడు కూడా అయిన జె.డి. ఎం.పి. ప్రజ్వల్ రేవణ్ణ సెక్స్ టేపుల కుంభకోణంలో చిక్కుకున్నారని, అతను దేశం విడిచి జర్మనీకి వెళ్లినట్లు నివేదికలు సూచిస్తున్నాయి.
నరేంద్ర మోదీ పై విరుచుకుపడ్డ అసదుద్దీన్ ఒవైసీ…

