గుంటురూ జిల్లాలోని ప్రత్తిపాడు మండలంలో వై.ఎస్.ఆర్.సీ.పీ. కి పెద్ద షాక్ తగిలింది. ధర్మవరం గ్రామానికి చెందిన వై.సీ.పీ. కార్యకర్తల కుటుంబాలు తెలుగుదేశం పార్టీలోకి చేరాయి. ప్రత్తిపాడు కూటమి అభ్యర్థి వరుపుల సత్య ప్రభ చేతులతో వారికి పార్టీ కండువా కప్పి వారిని పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ… జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ధరలు విపరీతంగా పెరిగి సామాన్యులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలంటే జగన్ ప్రభుత్వం పోయి బాబు ప్రభుత్వం రావాలని దానికి మనమందరం కృషి చేయాలని ఆమె సూచించారు. ఈ కార్యక్రమానికి పార్టీ కార్యకర్తలు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
ధర్మవరంలో వై.సీ.పీ. కి షాక్ ఇచ్చిన నేతలు…
