జమ్మూ కాశ్మీర్లోని దోడా జిల్లాలో సోమవారం అర్థరాత్రి జరిగిన ఎన్కౌంటర్లో మేజర్ ర్యాంక్ అధికారితో సహా నలుగురు ఆర్మీ సిబ్బంది మరణించిన తరువాత కాంగ్రెస్ పార్టీ మంగళవారం అధికార భారతీయ జనతా పార్టీపై తీవ్రంగా విరుచుకుపడింది. లోక్సభలో ప్రతిపక్ష నేత, రాహుల్ గాంధీ బీ.జే.పీ.ని తప్పు విధానాలని అభివర్ణిస్తూ సోషల్ మీడియా ప్లాట్ఫారమ్ X లో పోస్ట్ చేసారు. సమస్యాత్మక ప్రాంతంలో నిరంతర ప్రాణనష్టానికి బాధ్యత బీ.జే.పీ. వహిస్తారన్నారు. జవాబుదారీతనం యొక్క ఆవశ్యకతను నొక్కిచెప్పిన గాంధీ ఈ సంఘటనలను విచారకరమైన మరియు ఆందోళనకరమైనదిగా అభివర్ణించారు.
దోడా ఎన్కౌంటర్పై బీ.జే.పీ. పై విరుచుకుపడ్డ రాహుల్…
