ఇటీవల కాకినాడ సముద్ర తీర ప్రాంతంలో ఓ.ఎన్.జీ.సీ. గ్యాస్ వెలికితీత పనులు చేపట్టడంతో ఎటిమోగ, తదితర గ్రామాల మత్యకారలకు నష్ట పరిహారం ఇచ్చి వారిని ఆదుకోవాలని కాకినాడ జిల్లా అభివృద్ధి పోరాట కమిటీ చైర్మన్, సీ.పీ.ఐ. రాష్ట కార్యవర్గ సభ్యులు తాటిపాక మధు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… మత్యకారులను ఆదుకోవాలని కాకినాడలో ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిని డిమెండి చేయడం అభినందనీయం అన్నారు.
ఈదే అంశం పై సీ.పీ.ఐ. రౌండ్ టేబుల్ సమావేశము నిర్వహించిందని ఆయన గుర్తు చేశారు. రాజకీయాలకు అతితాంగా ఆంధ్ర ప్రదేశ్ ప్రజలు ముఖ్యంగా కాకినాడ ప్రజలు గ్యాస్ పై ఉద్యమిస్తే గుజరాత్ తరహాలో ఇక్కడ కూడా అతి తక్కువ ధరకు కాకినాడ ప్రజలకు ఇంటింటింటికి గ్యాస్ పంపిణి చేస్తారని పెట్రోల్ ధర అందరికి అందుబాటలో వుటందని ఆయన అన్నారు. సోమవారము జిల్లా కలెక్టర్ ను అఖిలపక్షం కలుస్తుందని మధు అన్నారు. మార్చి రెండవ వారం లో దీనిపై కాకినాడ లో రాష్ట్ర సదస్సు నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు.

