తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఇచ్చిన ఆరు హామీల అమలు మేరకు వాటికి సంబందించిన పనులను ప్రారంభించింది. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆరు హామీలకు సంబంధించి అర్హులను గుర్చించి వారి నుంచి దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. రాష్ట్ర వ్యప్తంగా ఏర్పాటుచేసిన ప్రజా పరిపాలన కార్యక్రమానికి భారీ స్పందన లభించింది. ఏర్పాటుచేసిన ఒక్క రోజులోనే 7.46 లక్షల దరఖాస్తులను లబ్దిధారులనుంచి స్వీకరించామని అధికారిక తెలిపారు. మహాలక్ష్మి, రైతు భరోసా, అభయహస్తం, గృహజ్యోతి, చేయూత, ఇందిరమ్మ ఇళ్ల వంటి ఆరు హామీ పథకాలకు దరఖాస్తులు లబ్దిధారులనుంచి అధికారులు స్వీకరిస్తున్నారన్నారు. అలాగే రేషన్ కార్డులు లేని వారు తెల్లకాగితాలపై అర్జీలు ఇవ్వాలని అధికారులు తెలిపారు. వీటన్నింటికీ రేషన్ కార్డులను జత చేయాలని అధికారులు సూచించారు.
తొలిరోజే 7.46 లక్షల దరఖాస్తులు నమోదు…

