తుఫాన్ హెచ్చరికల నేపద్యంలో ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా అప్రమత్తంగా ఉండాలని కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ సీ.హెచ్. నాగనరసింహారావు సంబంధిత అదికారులను ఆదేశించారు. స్థానిక కార్పొరేషన్ కార్యాలయంలో వివిధ విభాగాధిపతులు, ప్రత్యేకాధికారులతో ఈ అంశంపై సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ… రానున్న ఒకటి రెండు రోజుల్లో ఈదురు గాలులు, భారీ వర్షాలు పడే అవకాశం ఉందన్న వాతావరణ కేంద్రం హెచ్చరికలను దృష్టిలో ఉంచుకుని ఆయా డివిజన్లకు చెందిన ప్రత్యేకాధికారులు తగిన ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఎక్కడైనా చెట్లు, విద్యుత్ స్థంబాలు, హోర్డింగ్లు పడిపోవడం వంటి సంఘటనలు ఎదురైతే తక్షణమే సమస్య పరిష్కరించేలా సిద్ధంగా ఉండాలని సూచించారు. అలాగే తీర ప్రాంతాన్ని ఆనుకుని ఉన్న డివిజన్లలో ముంపుకు గురికావడం, వర్షాలు వల్ల ప్రజలు ఇబ్బందులు పడే పరిస్థితి ఎదురైతే సామాజిక భవనాలు, ఇతర సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు సిద్ధంగా ఉండాలని సూచించారు.
తుఫాన్ పట్ల అప్రమత్తంగా ఉండండి… టోల్ప్రీ నెంబర్ 1800 4255 990 కాల్ చేయండి…

