కాకినాడ జిల్లాలోని తుని మండలంలో జిల్లేడుపాడు గ్రామంలో ఇంటికి మన దివ్య కార్యాక్రమాన్ని తెలుగు దేశం పార్టీ ఇంచార్జ్ యనమల దివ్య నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టీ.డీ.పీ. రాష్ట్ర కార్య నిర్వాహన కార్యదర్శి యనమల కృష్ణుడు ముఖ్య అతిథిగా విచ్చాశారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ… రాష్ట్రం అభి వృద్ది చెందాలన్నా, అప్పుల ఊబి నుంచి మన రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి తెలుగు దేశం పార్టీని అధికారంలోకి తీసుకురావాలని అన్నారు.
దానికి మనమందరం కృషి చేయాలన్నారు. తదనంతరం అందరితో కలిసి ప్రతీ ఇంటికీ వెళ్తి టీ.డీ.పీ., జనసేన మినీ మేని ఫేస్టో లోని పథకాలను వివరిస్తూ… కర పత్రాలను పంపిణీ చేసారు. ఈ కార్యక్రమానికి టీ.డీ.పీ. తుని నియోజకవర్గ ఇన్చార్జ్ యనమల దివ్య, రాష్ట్ర కార్య నిర్వాహన కార్యదర్శి యనమల కృష్ణుడు, టీ.డీ.పీ. కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

