Political

తునిలో అంగన్వాడీలు సమ్మె…

WhatsApp Image 2024-01-16 at 9.36.53 AM

రాష్ట్రంలో అంగన్ వాడీ వర్కర్లు చేస్తున్న న్యాయ పోరాట నిరసర సమ్మె నేటికి 35 వ రోజు పూర్తిచేసుకున్నా రాష్ట్ర ముఖ్య మంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి అసలు పట్టించుకోవడంలేదని ఆందోళన వ్యక్తం చేసారు. ఈ సందర్బంగా తుని పట్టణంలో ఉన్న ఎం.ఆర్.ఓ. ఆఫిస్ ఎదుట నిరసనను వ్యక్తం చేసారు. సీ.ఐ.టీ.యూ. నాయకుడు నెక్కెళ్ళ శ్రీనివాసు మాట్లాడుతూ.. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను ఆధికారంలోకి ఎక్కిన తరువాత హామీలను మరచి వాటిని నెరవేర్చమంటే అంగన్ వాడీలపై కక్షసాదింపు చర్యలు చేపట్టారని మండి పడ్డారు. తమ సమస్యలను పరిష్కరించకపోతే సమ్మెలోకి వెళ్తామని చేప్పినా సమస్యలను పరిష్కరించే ప్రయత్నం కూడా చేయలేదని అన్నారు. పిల్లలతో జరుపుకోవలసిన సంక్రాంతి పండుగకు దూరంచేసారని అన్నారు. ఈ కార్యక్రమంలో సీ.ఐ.టీ.యూ. నాయకుడు నెక్కెళ్ళ శ్రీనివాసు, రమణ, సుబ్బలక్ష్మి, ధనలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

electrical
Political

నూతన ఎలక్ట్రికల్ బస్సు లు కొనుగోలుకు సిద్ధం..

ఈ ఏడాది విజయ దశమి సంధర్బంగా వెయ్యి ఎలక్ట్రికల్ బస్సు లు కొనుగోలుకు సిద్ధం చేస్తున్నామని ఆర్టీసీ ఎండి ద్వారకా తిరుమలరావు తెలిపారు. ఆర్టీసీ ఎండి ద్వారకా
R
Political

దత్తపుత్రుడి శాశ్వత చిరునామా తెలంగాణ..

దత్తపుత్రుడి శాశ్వత చిరునామా హైదరాబాద్ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మెహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పై తీవ్ర విమర్షలు చేసారు.