తిరుమలలో14వ శతాబ్దం1472 నందు నిర్మిత మైన వెయ్యి కాళ్ళ మండపాన్ని 20 వ శతాబ్దంలో 2003లో తొలగించడం జరిగందని శతాబ్దాల చరిత్రను తిరిగి పునః నిర్మాణంచేసే ప్రక్రియను కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టాలని స్వయంభు కాకినాడభోగిగణపతి పీఠం కోరింది. శనివారం ఉదయం సుప్రభాత వేళలో పీఠం ప్రాంగణం నందు తిరుమలశ్రీవారి పాదాల వద్ద గోవిందుని 43వ సహస్ర నామ జపయజ్ఞ పారాయణలో సంకీర్తన నిర్వహించారు.
శ్రీశ్రీశ్రీ శ్రీదేవి భూదేవి సమేత వేంకటేశ్వర స్వామి కలశాలకు విష్వక్సేన పూజలతో శ్రీవారి సేవకులు మంగళ హారతులందించారు. గణపతి వేంకటే శ్వర పంచలోహ ప్రతిమలకు పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు. పీఠం వ్యవస్థాపక ఉపాసకులు దూసర్ల పూడి రమణ రాజు మాట్లాడుతూ… తిరుమలలో వెయ్యి కాళ్ళ మండపాన్ని తొలగించి మరోచోట నిర్మించాలని ప్రతిపాదనలు చేసినా కార్యరూపం దాల్చలే దన్నారు. వాటికి అపచారం జరగకుండా భద్రపరచాలని టీ.టీ.డీ. ని కోరారు.

