రాష్ట్రంలో జనసేన–తెలుగుదేశం సంయుక్తంగా తాడేపల్లిగూడెం లో ఈ నెల 28వ తేదీన నిర్వహిస్తున్న భారీ బహిరంగ సభకు పార్టీ శ్రేణులు యుద్ధ ప్రాతిపదికన సమాయత్తం అయ్యి సభను విజయవంతం చేసేందుకు సహకరించాలని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ పిలుపునిచ్చారు. తాడేపల్లిగూడెం సమీపంలో ఈ సభను ఏర్పాటు చేయాలని ఇరు పార్టీల సమన్వయ కమిటీ సమావేశంలో నిర్ణయించినట్టు తెలిపారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… ఇరుపక్షాల కలయిక తరవాత జరుగుతున్న మొట్టమొదటి సభను విజయవంతం చేయడానికి ప్రతి ఒక్కరు బాధ్యతతో పని చేయాలని పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆదేశించినట్టు తెలిపారు. ఈ సభ నిర్వహణ బాధ్యతలు జనసేన చూస్తున్నట్టు చెప్పారు.
తాడేపల్లిగూడెంలో జనసేన–టీ.డీ.పీ. బహిరంగ సభ…

