కాకినాడ జిల్లా లో పెద్దాపురం మండలం పులిమేరు శివారులో బైక్ పై వెళుతున్న ముగ్గురు యువకులు రోడ్డు మలుపులో ఎదురుగా వస్తున్న టిప్పర్ను ఢీకొట్టడంతో గొల్లపల్లి సుకుమార్ అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. మరో ఇద్దరు యువకులకు తీవ్రగాయాలు కాగా, పెద్దాపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. గాయపడినవారు పిఠాపురం మండలం కుమారపురం గ్రామానికి చెందిన వారిగా స్థానికులు తెలిపారు. పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.
టిప్పర్ను ఢీకొని యువకుడు మృతి…

