2024 లోక్సభ ఎన్నికలకు సంబంధించి నాల్గవ దశ ఓటింగ్ ప్రస్తుతం జరుగుతోంది. తొమ్మిది రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలోని మొత్తం 96 లోక్సభ నియోజకవర్గాల్లో సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఈ రోజు జరుగుతున్న ఫేజ్ 4 ఎన్నికల్లో 1700 మందికి పైగా అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్, బీహార్, జమ్మూ కాశ్మీర్, జార్ఖండ్, ఒడిశా, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్, తెలంగాణ, మహారాష్ట్ర మరియు ఉత్తరప్రదేశ్లలో 4వ దశ ఎన్నికలు జరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్లోని 175 అసెంబ్లీ స్థానాలకు, ఒడిశాలోని 147 అసెంబ్లీ స్థానాలకు సోమవారం ఎన్నికలు జరగనున్నాయి. 2024 లోక్సభ ఎన్నికల 3వ దశ నాటికి, 20 రాష్ట్రాలు మరియు కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 283 లోక్సభ నియోజకవర్గాల్లో ఓటింగ్ సజావుగా మరియు ప్రశాంతంగా సాగింది. జూన్ 4న ఓట్ల లెక్కింపు జరగాల్సి ఉంది.
జోరుగా సాగుతున్న లోక్సభ ఎన్నికలు…

