ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈ.డీ. అరెస్టు చేయడంపై మీడియా సమావేశంలో ఢిల్లీ మంత్రి, ఏ.ఏ.పీ. నాయకురాలు అతిషి మాట్లాడుతూ… శరద్ చంద్రారెడ్డి ప్రకటన ఫలితంగా కేజ్రీవాల్ అరెస్టుకు దారితీసిందన్నారు. ఆయన ప్రకటన చేసిన కొద్దిసేపటికే ఈడీ ఆయనకు బెయిల్ మంజూరు చేసిందని ఆమె అన్నారు.
ఎక్సైజ్ పాలసీ స్కామ్ సమయంలో శరద్ చంద్రారెడ్డి రూ. 4.5 కోట్ల ఎలక్టోరల్ బాండ్లను బీ.జే.పీ. కి బదిలీ చేశారని అన్నారు. అరెస్ట్ అయిన తర్వాత బీ.జే.పీ. కి 55 కోట్ల బాండ్లు వచ్చాయని తెలిపారు. మొత్తం డబ్బు బీ.జే.పీ. బ్యాంకు ఖాతాకు బదిలీ చేయబడిందని ఈ.డీ. జే.పీ. నడ్డాను అరెస్టు చేయాలి, మొదటిసారిగా ఎక్సైజ్ పాలసీ కేసులో అధికారిక మనీ ట్రయల్ వెలుగులోకి వచ్చిందని ఆమె జోడించి చెప్పారు.

