కర్ణాటక రాష్ట్రంలో ఇప్పటివరకు కోవిడ్-19 వేరియంట్ జే.ఎన్.-1 కేసులు 34 కనుగొనబడ్డాయని వీటిలో మూడు మరణాలు సంభవించాయని రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ సేవల విభాగం తెలిపింది. జే.ఎన్.-1 నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (NIV), పూణే, నేషనల్ సెంటర్ ఫర్ బయోలాజికల్ సైన్సెస్ (NCBS), బెంగళూరులో జీనోమ్ సీక్వెన్సింగ్ కు సమర్పించిన 192 నమూనాలలో 60 నమూనాల ఫలితాలు నాటికి అందుబాటులో ఉన్నాయని తెలిపింది. ఇందులో మొత్తం 34 కేసులు జే.ఎన్.-1 వేరియంట్గా గుర్తించబడ్డాయని డిపార్ట్మెంట్ తెలిపింది.
కోవిడ్-19 ఇన్ఫెక్షన్ కేసుల పెరుగడం, రోగులలో కొత్త సబ్-వేరియంట్ జే.ఎన్.-1 ని గుర్తించడంతో ఢిల్లీ ప్రభుత్వం సమస్యను పరిష్కరించడానికి జన్యుపరమయున నిఘాను ఏర్పాటు చేయాలని ఆలోచిస్తున్నట్టు తెలిపింది. ప్రజలు మాస్కులు ధరించి, బహిరంగ సభలకు దూరంగా ఉండాలని ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది.
జే.ఎన్.-1 జన్యు నిఘాను ఏర్పాటు చేయాలి…. -ఢిల్లీ ప్రభుత్వం-
