కేంద్ర బడ్జెట్కు ముందు టీ.డీ.పీ. అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంగళవారం మరోసారి దేశ రాజధానిలో పర్యటించారు. గత నెలలో నాయుడు న్యూఢిల్లీకి వెళ్లి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, బీ.జే.పీ. అధ్యక్షుడు జే.పీ. నడ్డాతో సహా సీనియర్ మంత్రులను కలిశారు. సోమవారం జేడీయూ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ సంజయ్ కుమార్ ఝా కూడా నిర్మలా సీతారామన్ను కలిశారు.
జూలై 23న జరగనున్న కేంద్ర బడ్జెట్ 2024, బీ.జే.పీ. కీలక మిత్రపక్షాలు- తెలుగుదేశం పార్టీ , జనతాదళ్ యునైటెడ్ లు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సంఘటన అని చెప్పవచ్చు. రెండు పార్టీలు తమ తమ రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, బీహార్ రాష్ట్రాలకు నిధులపై కన్నేసింది. ఇద్దరు భాగస్వాములు ప్రత్యేక హోదా కోసం పట్టుబట్టడం లేదు. కానీ వారికి ప్రత్యేక ప్యాకేజీ కావాలని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

