నరేంద్ర మోడీ నేతృత్వంలోని ఎన్.డి.ఏ. ప్రభుత్వం అజిత్ దోవల్ను జాతీయ భద్రతా సలహాదారుగా తిరిగి నియమించేందుకు గురువారం అధికారిక ఉత్తర్వు జారీ చేసింది. ఆయన నియామకం ప్రధాని మంత్రి మోదీ పదవీ కాలంతో పాటు లేదా తదుపరి ఆదేశాల వరకు కొనసాగుతుందని ఉత్తర్వుల్లో పేర్కొంది. అజిత్ దోవల్, రిటైర్డ్ ఐ.పీ.ఎస్., క్యాబినెట్ నియామకాల కమిటీ 10.06.2024 నుండి జాతీయ భద్రతా సలహాదారుగా నియమించబడ్డాడని ఉత్తర్వుల్లో పేర్కొంది. మాజీ ఐ.పీ.ఎస్. అధికారి అయిన దోవల్కు ఆయన పదవీ కాలంలో ప్రాధాన్యత పట్టికలో కేబినెట్ మంత్రి ర్యాంక్ ఇవ్వబడుతుందని మరియు అతని నియామకానికి సంబంధించిన వివరాలను విడిగా తెలియజేస్తామని పేర్కొంది.
జాతీయ భద్రతా సలహాదారుగా అజిత్ దోవల్ నియామకం…

