మధ్యప్రదేశ్లోని మదన్ మహల్ రైల్వే స్టేషన్లో జబల్పూర్లో రైలు కిందపడి ఓ మహిళ ఆస్పత్రిలో చేరింది. ఈ ఘటన అక్కడి సీసీటీవీలో రికార్డయింది. అక్కడ బాలిక పరిగెడుతూ కదులుతున్న రైలు ఎక్కేందుకు ప్రయత్నించింది. ఆమె శ్రీధం ఎక్స్ప్రెస్ కోచ్ లోపలికి వెళ్లడానికి ప్రయత్నిస్తుండగా ఆమె కాళు జారడంతో కదులుతున్న రైలు కిందకు జారి ప్లాట్ఫారమ్పై పడింది. ఆమెను చూసి ప్లాట్ఫారమ్పై ఉన్న వ్యక్తులు ఆమెను రక్షించేందుకు పరుగులు తీశారు. రైలు కిందకు దూసుకెళ్లిన మహిళ భోపాల్కు వెళ్లే రైలును పట్టుకునేందుకు ప్రయత్నిస్తుండగా ప్రమాదానికి గురయినట్లు తెలిపారు. భాదితురాలు కట్నీ జిల్లాకు చెందిన కాజల్ దూబేగా గుర్తించారు.
జబల్పూర్లో రైలు కిందపడిన మహిళ…
