ఉత్తరాంధ్రలో సీనియర్ నేతగా పేరున్న కొణతాల రామకృష్ణ జనసేన తరపున అనకాపల్లి నుంచి ఎం.పీ. గా పోటీ చేసే యోచనలో ఉన్నారని సమాచారం. అనకాపల్లి లో జనసేన పార్టీ ఆత్మీయ సమావేశాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సమావేశానికి మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ ఆహ్వానించారు. ఆయన్ని జనసేన అభిమానులు గజమాల వేసి ఘన స్వాగతం పలికారు.
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… అనకాపల్లి జనసేన పార్టీలోకి చేరేందుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. బీ.సీ. సామాజికవర్గానికి చెందిన ఆయన 2004 నుంచి 2009 వరకు వై.ఎస్. కేబినెట్లో మంత్రిగా పని చేశారు. అంతకముదు 1989 నుంచి 1996 వరకు అనకాపల్లి ఎం.పీ. గా పని విశేష సేవలు అందిచారన్నారు. అయితే కొణతాల గత కొంత కాలంగా రాజకీయాలకు దూరంగా ఉన్నారన్నారు.

