Political

జనసేన పార్టీకి రూ.5 లక్షలు అందవేత…

WhatsApp Image 2024-03-27 at 8.19.22 AM

జనసేన ప్రస్థానంలో ప్రవాసాంధ్రుల సహకారం విలువైనదని పార్టీ ప్రధాన కార్యదర్శ కె. నాగబాబు అన్నారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాటం చేస్తున్న జనసేనకు ప్రజలు, ముఖ్యంగా విదేశాలలో స్థిరపడిన వారు వెన్నంటి ఉంటున్నారన్నారు. పవన్ కళ్యాణ్ సదాశయాలు, ఆలోచనలను ముందుకు తీసుకెళ్లడంలో జన సైనికులు, వీర మహిళలు ఎంతో క్రియాశీలకంగా పనిచేస్తున్నారని తెలిపారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో నాగబాబుని అరిగే వెంకటరత్నం జనసేన పార్టీకి రూ.5 లక్షలు సహకారం అందజేశారు. కాలిఫోర్నియాలో స్థిరపడిన అరిగే ఈశ్వర్ తమ తల్లి అరిగే వెంకటరత్నం పేరు మీద ఈ సహకారం అందజేశారని తెలిపారు. కుటుంబ సభ్యులు పొన్నెగంటి మస్తాన్ రావు, వరలక్ష్మి పాల్గొన్నారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

electrical
Political

నూతన ఎలక్ట్రికల్ బస్సు లు కొనుగోలుకు సిద్ధం..

ఈ ఏడాది విజయ దశమి సంధర్బంగా వెయ్యి ఎలక్ట్రికల్ బస్సు లు కొనుగోలుకు సిద్ధం చేస్తున్నామని ఆర్టీసీ ఎండి ద్వారకా తిరుమలరావు తెలిపారు. ఆర్టీసీ ఎండి ద్వారకా
R
Political

దత్తపుత్రుడి శాశ్వత చిరునామా తెలంగాణ..

దత్తపుత్రుడి శాశ్వత చిరునామా హైదరాబాద్ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మెహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పై తీవ్ర విమర్షలు చేసారు.