Political

జనసేన తోనే దివ్యాంగులు అభివృద్ధి సాధ్యం…

IMG-20231212-WA0023

 జనసేన తోనే దివ్యాంగులు అభివృద్ధికి సాధ్యం..

కాకినాడలోని సిద్ధార్థ నగర్లో ఉన్న జనసేన పార్టీ కార్యాలయంలో దివ్యాంగులతో కలిసి శశిధర్ విలేకరులతో సమావేశాన్ని నిర్వహించారు. జనసేన పార్టీ ద్వారానే దివ్యాంగుల సమస్యలకు పరిష్కారం లభిస్తుందని జనసేన పార్టీ కాకినాడ సిటీ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జ్ ముత్తా శశిధర్ అన్నారు. అలాగే దివ్యాంగుల అభివృద్ధికి అడ్డుగా ఉన్న నిబంధనలను ఎత్తివేయాలని ఆయన పేర్కొన్నారు.

ఈ సందర్భంగా శశిధర్ మాట్లాడుతూ… కాకినాడ నగరంలో ఉన్న ఏటిమొగ ప్రాంతంలో సుమారు 200 మందికి పైగా దివ్యాంగులు ఉన్నారని వీరికి పథకాలు అందటం లేదన్నారు. గతంలో పెళ్ళికానుకకు సంబంధించి నేరుగా మనీ ఆర్డర్ ఇంటికి వచ్చేదని ప్రస్తుతం పలు నిబంధన వల్ల అవి దివ్యాంగులకు అందటం లేదన్నారు. వీరి అభివృద్ధి కోసం రుణాలను అందించి ఆదుకోవాలని సూచించారు. అలాగే వీరికి కాకినాడ సిటీలోనే ఇళ్ళు ఇచ్చేలా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకు వెళ్తానని చెప్పారు. 

Avatar

Simhadri Penke

About Author

You may also like

electrical
Political

నూతన ఎలక్ట్రికల్ బస్సు లు కొనుగోలుకు సిద్ధం..

ఈ ఏడాది విజయ దశమి సంధర్బంగా వెయ్యి ఎలక్ట్రికల్ బస్సు లు కొనుగోలుకు సిద్ధం చేస్తున్నామని ఆర్టీసీ ఎండి ద్వారకా తిరుమలరావు తెలిపారు. ఆర్టీసీ ఎండి ద్వారకా
R
Political

దత్తపుత్రుడి శాశ్వత చిరునామా తెలంగాణ..

దత్తపుత్రుడి శాశ్వత చిరునామా హైదరాబాద్ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మెహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పై తీవ్ర విమర్షలు చేసారు.