నందిత కన్స్ట్రక్షన్స్ అధినేత మల్లాడి రాజేంద్ర ప్రసాద్ జనసేన పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో పవన్ యొక్క ఆశయాలు, అలాగే మత్స్యకారులకు అతను ఇస్తున్న భరోసా నచ్చి జనసేన పార్టీలోకి తన వర్గీయులతో భీమవరంలో పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో చేరడానికి నిర్ణయించుకున్నామని తెలిపారు. అందులో భాగంగానే బుధవారం ఉదయం 11 గంటలకు ర్యాలీగా భీమవరానికి బయలుదేరుతున్నామని వెళ్లడించారు. కావున కాకినాడలోని జగన్నాథపురం ఎం.ఎస్.ఎన్. చారిటీస్ మొదటి వీధి రామాలయం పక్కన మల్లాడి రాజేంద్రప్రసాద్ కార్యాలయానికి మీడియా మిత్రులు ఉదయం 11 గంటలకు హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మీడియా మిత్రులను కోరి ప్రార్థిస్తున్నానన్నారు.
జనసేనలో చేరనున్న నందిత కన్స్ట్రక్షన్స్ అధినేత…!!!

