Political

జగ్గంపేటలో జనసేనలో భారీగా చేరికలు…

WhatsApp Image 2024-05-06 at 7.57.01 AM

జగ్గంపేట నియోజకవర్గంలో వై.సీ.పీ. కి భారీ షక్ తగిలింది. ఆ నియోజకవర్గం నుంచి 100 మందికి పైగా వై.సీ.పీ. నాయకులు, మాజీ ఎం.పీ.టీ.సీ. లు, సొసైటీ ప్రెసిడెంట్లు, కార్యకర్తలు ఆ పార్టీ ని వీడి స్వచ్చందంగా జనసేనలో పార్టీలో చేరారు. అక్కడి ఇన్చార్జి తుమ్మలపల్లి రమేష్ ఆధ్వర్యంలో చేబ్రోలు పార్టీ కార్యాలయంలో నాగబాబు వారికి పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. వై.సీ.పీ. దుర్మార్గాలు భరించలేక ఆ పార్టీని వీడి జనసేనలో చేరుతున్నట్లు వారు వివరించారు. ఈ సందర్భంగా నాగబాబు మాట్లాడుతూ.. మరి కొన్ని రోజుల్లో కూటమి ప్రభుత్వం ఏర్పడనున్నదని, కూటమి ప్రభుత్వంలో ప్రజలందరికీ ప్రయోజనకరమైన పరిపాలన ఉంటుందని తెలిపారు. పార్టీలో చేరిన వారిలో మెడబోయిన గోవిందరాజు, మెడబోయిన శ్రీను, అంకం గంగాశంకర్, తలటం సూరిబాబు, యండ్ర శ్రీను, తదితరులు ఉన్నారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

electrical
Political

నూతన ఎలక్ట్రికల్ బస్సు లు కొనుగోలుకు సిద్ధం..

ఈ ఏడాది విజయ దశమి సంధర్బంగా వెయ్యి ఎలక్ట్రికల్ బస్సు లు కొనుగోలుకు సిద్ధం చేస్తున్నామని ఆర్టీసీ ఎండి ద్వారకా తిరుమలరావు తెలిపారు. ఆర్టీసీ ఎండి ద్వారకా
R
Political

దత్తపుత్రుడి శాశ్వత చిరునామా తెలంగాణ..

దత్తపుత్రుడి శాశ్వత చిరునామా హైదరాబాద్ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మెహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పై తీవ్ర విమర్షలు చేసారు.