ఏ.పీ.లో వై.సీ.పీ. చీఫ్ రాష్ట్ర సీ.ఎం. జగన్ కు మరో చెల్లెలు షాక్ ఇవ్వబోతోంది. జగన్ సోదరి వై.ఎస్. వివేకానంద రెడ్డి కుమార్తె డాక్టర్ నర్రెడ్డి సునీత రెడ్డి ప్రత్యక్ష రాజకీయాల్లో అడుగు పెడుతున్నారు. ఆమె త్వరలో కాంగ్రెస్ లో చేరబోతున్నారు తెలిపారు. షర్మిల పీ.సీ.సీ. అధ్యక్షురాలుగా ఏ.పీ. లో చక్రం తిప్పబోతున్న సమయంలో సునీత కూడా కాంగ్రెస్ లో జాయిన్ అవ్వాలనుకోవడం రాజకీవర్గాల్లో సంచలనం సృష్టిస్తోంది.
వివేకానంద రెడ్డి హత్య తరువాత ఆమె కుమార్తె సునీతా రెడ్డి యాక్టివ్ అయ్యారనే చెప్పొచ్చు. వివేకా హత్య కేసులో సీ.బీ.ఐ. విచారణకు కీలకమైన సమాచారం ఇచ్చారు. అంతేకాకుండా కోర్టుల్లో కేసుల్లో కూడా సునీత ఇంప్లీడ్ అయ్యారు. తన తండ్రిని చంపిన వారికి శిక్ష పడాలని న్యాయ పోరాటం చేస్తున్నారు. ఆమె వైఎస్ జగన్ కు అపోజిట్ గా కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు.

